అక్కడ పుంగనూరు పుడింగి,,ఇక్కడ బియ్యపురెడ్డి-చంద్రబాబు
శ్రీకళాహస్తీ: గోదావరి నీళ్ళు రాయల సీమకు తీసుకు వెళ్ళడమే నా లక్ష్యం,,పెద్దిరెడ్డి దోపిడీ కోసమే కొత్త ప్రాజెక్ట్ ల రూపకల్పన,,ప్రస్తుతం జరగబొతున్నకురుక్షేత్ర యుద్దంలో వైసీపీ కౌరవులను ఓడించాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీకళాహస్తీ ప్రజలను కోరారు..శనివారం సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దభేరి కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలో చంద్రబాబునాయుడు రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు.సైకో అని పోస్టర్ పెడితే ఎమ్మెల్యే బియ్యపురెడ్డి ఎందుకు భుజాలు తడుముకుంటున్నాడు అంటూ ప్రశ్నించాడు..సైకో పాలన చేస్తున్న వాళ్లని ప్రజలు సైకోలని పిలుస్తుంటే, అధికారులకు వచ్చిన నష్టం ఏంటి? కమీషన్ల కోసం ఎమ్మెల్యే బియ్యపు రెడ్డి చేస్తున్న కక్కుర్తి పనులకు ఉన్న పరిశ్రమలు పోయే పరిస్థితి వచ్చిందంటూ మండిపడ్డారు.