AMARAVATHICRIME

తృణమూల్ కాంగ్రెస్ నేత సత్యన్ చౌదరిని తుపాకీతో కాల్చిచంపిన దుండగులు

అమరావతి: తృణమూల్ కాంగ్రెస్ నేత సత్యన్ చౌదరి హత్యకు గురయ్యారు..అదివారం మధ్యహ్నం పశ్చిమ బెంగాల్, ముర్షిదాబాద్ లోని తన ఇంటికి దగ్గరలోని ఓ షాపు వద్ద కూర్చుని వుండగా గుర్తు తెలియని ఇద్దరు ఆగంతకులు బైక్ పై వచ్చి అతి సమీపం నుంచి తుపాకీతో కాల్పు జరిపి అక్కడి నుంచి పరారీ అయ్యారు..చుట్టు ప్రక్కల వారు స్పందించి తీవ్రంగా గాయపడిన అతడిని బహరంపూర్ మెడికల్ కాలేజ్ తరలించారు..ముగ్గురు వైద్యులు అతనికి చికిత్స అందించినప్పటి ఫలితం లేక పోయింది..మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు..ముర్షిదాబాద్ కు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సత్యన్ చౌదరి మృతి పట్ల తృణమూల్ కాంగ్రెస్ నేతలు విచారం వ్యక్తం చేశారు.. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *