AMARAVATHIPOLITICS

అమరావతి, తిరుపతిలో పవన్ తో కలిసి సభలు నిర్వహిస్తాం-చంద్రబాబు

కష్టాల్లో ఉన్న టీడీపీని చూసి తన వంతు సాయం చేశా-పవన్
అమరావతి: సూపర్ సిక్స్ తరహాలో త్వరలో మరిన్ని పథకాలు ప్రకటిస్తామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించగా,,ఈ ముఖ్యమంత్రికి ప్రజాస్వామ్యం విలువ తెలియదు,,ఇంట్లో ఉన్న తల్లికి, చెల్లిని విలువ ఇవ్వనివాడు మనకు ఎందుకు? అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు..బుధవారం నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద యువగళం-నవశకం పేరుతో టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది..ఈ సందర్బంలో చంద్రబాబు మాట్లాడుతూ త్వరలో అమరావతి, తిరుపతిలో పవన్ తో కలిసి సభలు నిర్వహిస్తామని,,ఆ సభల్లో టీడీపీ-జనసేన ఎన్నికల ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామని చెప్పారు..20 లక్షల మందికి ఉపాధి,,నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు భృతి ఇస్తామన్నారు..అంతకు మునుపు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సీ.ఎంకు ప్రజాస్వామ్యం అనే పదానికి జగన్ కు విలువ తెలియదని,,చంద్రబాబును జైలులో పెట్టడం బాధాకరం,,ఏదో ఆశించి నేను టీడీపీకి మద్దతు ఇవ్వలేదని కష్టాల్లో ఉన్న టీడీపీని చూసి తన వంతు సాయం చేశా అని అన్నారు..రాష్ట్రానికి మేలు జరగాలంటే 2024లో జగన్ ను ఇంటికి పంపించాల్సి వుందన్నారు..లోకేష్…. జగన్ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని విరుచుకుపడ్డారని,,అడ్డంగా రాష్ట్రాన్ని దోచుకున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు..ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంపై సెటైర్లు వేశారు..జగన్ ఐపీఎల్ ఐపీఎల్ టీమ్ పేరు కోడికత్తి వారియర్స్..ఆ ఐపీఎల్ లో టీమ్ మెంబర్స్… సీనియర్ బ్యాట్స్ మెన్ అవినాశ్ రెడ్డి. బాబాయ్ ని గట్టిగా కొట్టాడు కదా… బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్,, అరగంట స్టార్ అంబటి,,గంట స్టార్ అవంతి,, ఆల్ రౌండర్ గోరంట్ల మాధవ్,, రీల్ స్టార్ భరత్,, బూతుల స్టార్ కొడాలి నాని,, చీటర్ బియ్యపు మదుసూదన్ రెడ్డి,, ఇదే అద్భుతమైన ఐపీఎల్ టీమ్” అంటూ ఎద్దేవా చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *