CRIMENATIONAL

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డ ప్రమాదం-13 మంది మృతి

అమరావతి: మధ్యప్రదేశ్ లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది..ఇండోర్ నుంచి పూణేకు వెళ్తున్న మహారాష్ట్ర రోడ్డ ట్రాన్స్ పోర్టు బస్సు,,ధర్ జిల్లాలోని కాల్ ఘాట్ సంజయ్ సేతు వద్ద అదుపు తప్పి,నర్మదా నదిలో పడిపోయింది..ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న13 మంది మరణించగా,, స్థానికులు తక్షణం సహాయక చర్యలు చేపట్టి 15 మంది ప్రయాణికులను రక్షించినట్లు మధ్యప్రదేశ్ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు.. ఇక నర్మదా నదీ ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలు నెమ్మదిగా జరుగుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 40 మంది ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు..మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం?

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *