గౌరికుండ్ వద్ద కొండచరియలు విరిగిపడడంతో 3 మృతి, మరో 17 మంది గల్లంతు
అమరావతి: ఉత్తరాఖండ్,,రుద్రప్రయాగ్ జిల్లాలోని కేదార్ నాథ్ కు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌరికుండ్ వద్ద కొండచరియలు విరిగిపడడంతో 3 మృతిచెందగా, మరో 17 మంది కన్పించకుండా పోయినట్లు సమాచారం..భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడినట్లు సంబందిత జిల్లా అధికారులు తెలిపారు..ప్రస్తుతం గౌరీకుండ్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.. భారీ స్థాయిలో రాళ్లు, మట్టిపెల్లలు పడడంతో,, రోడ్ ప్రక్కనే ఉన్న షాపులు, దాబాలు మట్టి,,రాళ్ల క్రింది చిక్కుకుని పోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు..ప్రమాదం జరిగే సమయంలో షాపులు, దాబాల్లో నలుగురు స్థానికులతో పాటు 17 మంది నేపాలీలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు..ఎస్డీఆర్ఎఫ్ దళాలు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు జిల్లా అధికారులు వెల్లడించారు.