“రివర్ ఫ్రంట్ డెవెలెప్మెంట్” క్రింద స్వర్ణాల చెరువు అభివృద్ధి పరిశీలించిన అధికారులు
నెల్లూరు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు “రివర్ ఫ్రంట్ డెవెలెప్మెంట్” కార్యక్రమంలో భాగంగా నగర పాలక సంస్థ పరిధిలోని స్వర్ణాల చెరువు అభివృద్ధికి తగిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అస్సెట్ మనేజ్మెంట్ లిమిటెడ్ (APUIAML) చీఫ్ ఆర్కిటెక్ట్ కిరణ్ కుమార్, కమిషనర్ వికాస్ మర్మత్,లు అధికారులకు సూచించారు. స్థానిక స్వర్ణాల చెరువు నెక్లెస్ రోడ్ తీర ప్రాంతంలో ఏ. APUIAML, నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి వారు శుక్రవారం పర్యటించారు. స్వర్ణాల చెరువు తీరం వెంబడి నడక మార్గం, ప్రహరీ గోడల నిర్మాణం, వ్యర్ధాల నుంచి తయారుచేసిన ఉత్పత్తుల ప్రదర్శన, గజేబో, మోరల్ ఆర్ట్స్ తదితర నిర్మాణాల ప్రతిపాదనలను సిద్ధం చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ సంపత్ కుమార్, ఈ.ఈ సంజయ్, డి.ఈ చంద్రయ్య, ఏ.ఈ లు, సిబ్బంది పాల్గొన్నారు.