నిజమే ఏపీలో దొంగఓట్లు వున్నాయి-ఈసీ
అమరావతి: ఆంద్రప్రదేశ్ లో దొంగ ఓట్ల వివరాలు తెలియచేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు..ఎంపీ లేఖకు ప్రత్యుత్తరంగా తాజాగా ఈసీ దొంగ ఓట్ల వివరాలను వెల్లడించింది.. ఒకే డోర్ నెంబర్ ఉన్న ఇళ్లలో 24,61,676 ఓట్లు ఉన్నాయని తెలిపింది..దొంగ ఓట్లు భారీగా ఉన్నట్లు తేలడంతో వాటి ఏరివేతకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టామని ఎంపీకు పంపిన ఉత్తరంలో ఈసీ తెలిపింది..ఇంకా లక్షా 90,393 ఓట్లు సరిదిద్దాల్సినవి ఉన్నాయని పేర్కొంది.. అదే విధంగా 1,36,592 ఇళ్లలో తనిఖీలు చేయాల్సి వుందని తెలిపింది..ఈ మేరకు వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపినట్లు సీఈవో నుంచి వివరాలు వెల్లడించారు.