2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం-వకృత్వ పోటీల విజేత
నెల్లూరు: 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం అనే అంశంపై కేంద్ర యువజన వ్యవహారాలు,క్రీడ మంత్రిత్వ శాఖ,, నెహ్రూ యువ కేంద్ర నెల్లూరు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వకృత్వ పోటీలు నిర్వహించడం జరిగిందని జిల్లా యువజన అధికారి మహేంద్రరెడ్డి తెలిపారు..బుధవారం అయన మాట్లాడుతూ వకృత్వ పోటీల్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు.. మొదటి స్థాయిలో అగస్త్య నిలిచారని,,ఇతన్ని రాష్ట్రస్థాయిలో జరుగు వక్రత పోటీలకు పంపడం జరుగుతుందన్నారు.. రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో మొదటి విజేతకు లక్ష రూపాయలు, ద్వితీయ స్థానానికి 50 వేల రూపాయలు, తృతీయ స్థానాలలో ఇద్దరికీ 25 వేలు చొప్పున బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు.