ఏప్రిల్ 19న జరగనున్న లోక్సభ తొలి విడత ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ
అమరావతి: ఏప్రిల్ 19వ తేదిన పోలింగ్ జరగనున్న లోక్సభ తొలి విడత ఎన్నికల కోసం బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది..నోటిఫికేషన్ జారీతో నేటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.. బీహార్ మినహా తొలి విడత లోక్సభ ఎన్నికలు జరిగే మిగితా 20 రాష్ట్రాలు,, కేంద్రపాలిత ప్రాంతాల్లో నామినేషన్ దాఖలుకు ఈ నెల 27వ తేది వరకు అవకాశం కల్పించారు..బీహార్లో మాత్రం మార్చి 28వ తేది వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఇచ్చారు.. బీహార్ తప్ప మిగిలిన 20 రాష్ట్రాలు,, కేంద్రపాలిత ప్రాంతాల్లో మార్చి 28న నామినేషన్ల స్క్యూటినీ నిర్వహించనున్నారు..బీహార్లో మార్చి 30న నామినేషన్ల స్క్రూటినీ జరగనుంది.. బీహార్ మినహా మిగిలిన 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మార్చి 30 నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు. బీహార్లో నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 2 వరకు అవకాశం ఇచ్చారు..జూన్ 6వ తేదితో దేశ వ్యాప్తంగా సాధారణ ఎన్నికల ప్రక్రియ సంపూర్ణంగా ముగుస్తుంది..
తొలి విడతలో 17 రాష్ట్రాలు,,నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది..ఇందులో తమిళనాడులోని మొత్తం 39 స్థానాలు,, రాజస్థాన్లోని 12 స్థానాలు,, ఉత్తరప్రదేశ్లోని 8 స్థానాలు,, మధ్యప్రదేశ్లోని 6 స్థానాలు,, ఉత్తరాఖండ్,,అసోం,, మహారాష్ట్రల్లోని 5 స్థానాలు,, బీహార్లోని 4 స్థానాలు,, పశ్చిమబెంగాల్లోని 3 స్థానాలు,, అరుణాచల్ప్రదేశ్,,మణిపూర్,, మేఘాలయ రాష్ట్రాల్లోని 2 స్థానాలు,,ఛత్తీస్గఢ్,, మిజోరం,,నాగాలాండ్,, సిక్కిం,,త్రిపుర,, అండమాన్ నికోబార్ దీవులు,,జమ్ముకశ్మీర్,, లక్షద్వీప్,, పుదుచ్చేరిల్లోని ఒక్కో స్థానం ఉన్నాయి.