ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసే హోర్డింగ్స్ కు అనుమతులు తప్పనిసరి-ఎన్నికల సంఘం
అమరావతి: రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసే హోర్డింగ్స్ విషయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని కేంద్ర ఎన్నికల సంఘం కఠినంగా హెచ్చరించింది..ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ అనూజ్ చండక్ బుధవారం ప్రకటన విడుదల చేశారు.. అభ్యర్థుల ప్రచార ఖర్చును అంచనా వేయడానికి హోర్డింగ్స్ పై ప్రచురణ కర్తల పేర్లు తప్పనిసరిగా ముద్రించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.. ఇటీవల కాలంలో ప్రచురణ కర్తల పేర్లు లేకుండా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన బ్యానర్లు, హోర్డింగ్స్ ఎక్కువుగా ఏర్పాటు చేస్తున్నారు..దింతో రంగంలోకి దిగిన ఎన్నికల సంఘం, ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలి ప్రాంతాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది..అలాగే ఎన్నికల సంబంధిత సామాగ్రి, హోర్డింగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఈసీ సూచించింది.. ఛీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్, జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనూజ్ చండక్ వెల్లడించారు.. ప్రజాప్రతినిధ్య చట్టం 1951 ప్రకారం ఎన్నికల ప్రచారంతో సంబంధం ఉన్న కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లకార్డులు, బ్యానర్లపై ప్రచురుణ కర్త పేరు లేకుండా ముద్రించడానికి వీలులేదన్నారు..అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రభుత్వ ఖర్చుతో రాజకీయ ప్రకటనలు ఇవ్వరాదని తెలిపారు.. ప్రతి రాజకీయ పార్టీ తమ ప్రకటనలను ముందుగానే సర్టిఫికిషేన్ చేయించుకోవాలని ఎన్నికల సంఘం అధికారులు సూచించారు.