NATIONAL

డేటా గోప్యతపై త్వరలోనే బిల్లు సిద్ధం-కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

అమరావతి: డేటా గోప్యతపై త్వరలోనే బిల్లు సిద్ధంకానున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు..ఈ బిల్లుపైనే ప్రస్తుతం ఐటీ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్‌ దృష్టి పెట్టారని,,పార్లమెంటులో త్వరలోనే డేటా గోప్యతకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు..బుధవారం అమెరికా-భారత్ వ్యాపార మండలి ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఈ సందర్భంగా సీతారామన్ మాట్లాడుతూ గోప్యతా బిల్లుపై ఉన్న అన్ని సందేహాలు కూడా త్వరలోనే నివృత్తి చేసుకోవచ్చని,, సంబంధిత నిపుణులందరితోనూ సంప్రదింపులు జరిపి ఈ బిల్లును తీసుకొస్తున్నట్లు తెలిపారు.. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు-2019ను, కేంద్ర ప్రభుత్వం గత నెలలో జరిగిన లోక్‌సభ సమావేశాల్లో నుంచి ఉపసంహరించుకుంది..వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుపై పార్లమెంట్‌ సంయుక్త కమిటీ 99 సెక్షన్లకు కాను 81 సవరణలు,,12 రెకమండేషన్స్ ను సూచించడంతో తాము ఆ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.అంతేగాక,  12 కీలక సిఫారసులు చేసిందని తెలిపారు. దీంతో డేటా గోప్యతపై కొత్త బిల్లు తీసుకురాకతప్పదని చెప్పారు. వచ్చే బడ్జెట్‌ సమావేశాల నాటికి ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉందని ఆయన అప్పట్లో తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *