AMARAVATHI

రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు నిలిపివేయండి!- సుప్రీంకోర్టు

అమరావతి: ఆంధప్రదేశ్ లో ఇసుక తవ్వకాలు నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది..ఈ తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.. ఆంధప్రదేశ్ లో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని,,ఈ తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ మార్చి 23వ తేదిన నిషేధం విధించింది.. NGT విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది..ఈ వాజ్యంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఎన్జీటీ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వటానికి నిరాకరించింది..ఎన్టీజీ విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం వేసిన పిటీషన్ పై విచారణ జరిపిన జస్టిస్ అభయ్,,జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మానం ఈ కీలక తీర్పును వెలువరించింది.. ఎన్జీటీ తీర్పును సస్పెండ్ చేయడానికి నిరాకరించటమే కాకుండా ఎన్జీటీ తీర్పును యథాతథంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది..ఇదే సమయంలో ఇసుక తవ్వకాల విషయంలో ప్రభుత్వానికి, ఎన్జీటీ విధించిన రూ. 18 కోట్ల జరిమానాపై మాత్రం స్టే విధించింది..రాష్ట్రంలో ఇసుక తవ్వకాలను జగన్ ప్రభుత్వం, జయ ప్రకాశ్ వెంచర్స్ లిమిటెడ్ కు అప్పగించింది..సదరు సంస్థ భారీ యంత్రాలతో ఇష్టానురీతిగా ఇసుక తవ్వకాలు కొనసాగించింది..ఈ విషయంపై ఫిర్యాదులు అందడంతో పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలను చేపడుతున్నారని ఎన్జీటీ,, ఆంధప్రదేశ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ,, మార్చి 23న తవ్వకాలపై నిషేధం విధించింది..ఇసుక తవ్వకాలతో పర్యావరణానికి జరిగిన నష్టాన్ని గుర్తించాలని నిపుణుల కమిటీని ఆదేశించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *