అంగన్వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించిన రాష్ట్ర ప్రభుత్వం
అమరావతి: తమ డిమాండ్లు పరిష్కారించాలంటూ గత 26 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా (Esma) ప్రయోగించింది.. రాష్ట్రంలో 6 నెలల పాటు సమ్మెను నిషేధిస్తూ జీవో జారీచేసింది.. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తెస్తూ GO- NO2ను విడుదల చేసింది..ఇదే సమయంలో సమ్మె చేసిన కాలానికి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల జీతాల్లో రూ.3 వేలు తగ్గించి,,రూ.8050 వేతనాన్ని వారి ఖాతాల్లో జమచేసింది..వేతనాల పెంపు సహా ఇతర సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు డిసెంబర్ 11న సమ్మె బాటపట్టిన వారిని సమ్మెను విరమింప జేసేందుకు ప్రభుత్వం వారితో రెండు పర్యాయాలు జరిపిన చర్చలు విఫమయ్యాయి..దీంతో తమ డిమాండ్లను పరిష్కరించేవరకు సమ్మెను కొనసాగిస్తామని అంగన్వాడీలు స్పష్టం చేసిన విషయం విదితమే.