AMARAVATHITECHNOLOGY

జాబిల్లి వైపు ప్రయాణం ప్రారంభించిన విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్

అమరావతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైంది..శుక్రవారం శ్రీహరికోట సెంటర్ నుంచి చంద్రయాన్-3 ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన MLVM-3 M4 రాకెట్ భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోస్తూ నింగిలోకి దూసుకెళ్లనుంది.. మధ్యాహ్నం 2.35.17 సెకండల్లకు జాబిల్లి వైపు ప్రయాణం ప్రారంభించింది..MLVM-3 M4 రాకెట్, 3,900 కిలోల బరువున్న చంద్రయాన్-3 పేలోడ్ ను రోదసీలోకి పంపారు.. రాకెట్ నుంచి విడిపోయాక వ్యోమనౌకను భూకక్ష్య నుంచి చంద్రుని కక్ష్య వరకూ మోసుకెళ్లే ప్రొపల్షన్ మాడ్యూల్, అక్కడి నుంచి చంద్రునిపై దిగిన తర్వాత పరిశోధనలు చేసేందుకు విక్రమ్ ల్యాండర్, ఉపరితలంపై తిరుగుతూ పరిశోధనలు చేపట్టే ప్రగ్యాన్ రోవర్ చంద్రయాన్-3లో ఉన్నాయని ఇస్రో తెలిపింది.. చంద్రయాన్-3ని భూమి చుట్టూ ఉన్న 170 X 36,500 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో రాకెట్ ప్రవేశపెడుతుంది..ఈ మాడ్యల్ 24 రోజులు భూమి చుట్టూ తిరుగుతుంది.. ఆగష్టు 23 లేదా 24వ తేదిల్లో ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్, రోవర్ తో కూడిన మాడ్యూల్ విడిపోతుంది..ఇది గంటకు 6వేల కిలో మీటర్ల వేగంతో జాబిల్లి ఉపరితలం దిశగా దూసుకెళ్తుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *