ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన సీబీఐ
అమరావతి: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో డిప్యూటీ సీఎం,, ఆప్ కీలక నేత మనీష్ సిసోడియాను CBI ఆదివారం అరెస్ట్ చేసింది. సిసోడియాను దాదాపు 8 గంటలపాటు విచారించిన సీబీఐ రాత్రి 7:30 గంటల సమయంలో అరెస్ట్ చేసింది..సోమవారం సిసోడియాను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు..అరెస్ట్ సమాచారాన్ని ఆయన కుటుంబ సభ్యులకు సీబీఐ అధికారులు తెలిపారు..సిసోడియా అరెస్ట్ నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు అవకాశం లేకుండా సిసోడియా నివాసంతోపాటు సీబీఐ ప్రధాన కార్యాలయం పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు..గత సంవత్సరం నవంబర్లో తీసుకొచ్చిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన,,టెండర్ల అమలులో అవినితి చోటు చేసుకుందని,,ప్రభుత్వంకు రావల్సి ఆదాయంకు గండి కొట్టారన్న అరోపణలపై లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సీబీఐ విచారణకు సిఫారసు చేశారు..ఈ కేసులో సిసోడియాతో పాటు మరో 14 మందిపై సీబీఐ గత సంవత్సరం ఆగస్టులో ప్రత్యేక కోర్టులో కేసు నమోదు చేసింది..దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన కేసులో సిసోడియాతో పాటు ఇతర ఎక్సైజ్ శాఖ అధికారులను కూడా నిందితులుగా పేర్కొన్న విషయం విదితమే..