CRIME

పొదలకూరులో పరిధిలో చెరువులో పడి ఆరుగురు యువకులు దుర్మరణం

నెల్లూరు: నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తోడేరు గ్రామంలో అదివారం మధ్యహ్నం విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది.సరదాగా చెరువులో చేపలు పట్టేందుకు పడవలో వెళ్లిన పదిమంది యువకులు వెళ్లారు..చెరువులు మధ్యలో వున్న సమయంలో పడవ తిరగడంతో,వీరు నీటిలో పడిపోయారు..వీరిలో నలుగురు యువకులకు ఈత తెలిసి వుండడంతో క్షేమంగా బయటకు వచ్చి,,జరిగిన సంఘటన గురించి,గ్రామస్థులకు సమాచారం అందించారు.చెరువులో మునిగి పోయిన వారిలో మన్నూరు కళ్యాణ్ (30),,అల్లి శ్రీనాథ్ (16),,పాటీ.సురేంద్ర (16),,బట్టా రఘు(25),, పముజుల.బాలాజీ (20),,చల్లా ప్రశాంత్ కుమార్ (26)లు వున్నారు..సమాచారం అందుకున్నపోలీసులు,,గజ ఈతగాళ్లను రప్పించి, గాలింపు చర్యలు చేపట్టారు..సోమవారం మధ్యాహ్ననికి  మన్నూరు కళ్యాణ్ (30),,అల్లి శ్రీనాథ్ (16),,బట్టా రఘు(25),,పముజుల.బాలాజీ (20),,చల్లా ప్రశాంత్ కుమార్ (26)మృతదేహాలు లభ్యమయ్యాయి.. పాటీ.సురేంద్ర కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి..సంఘటన గురించి సమాచారం అందుకున్న జిల్లా మంత్రి కాకాణి.గోవర్ధన్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని జిల్లా కలెక్టర్,ఎస్పీలతో కలసి పరిస్థితి పై సమీక్ష నిర్వహించారు..ఇంక పూర్తి సమాచారం అందాల్సి వుంది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *