AMARAVATHI

మరో మూడు రోజులు వర్షాలకు అవకాశం-వాతావరణ శాఖ

అమరావతి: రాబోయే మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్,,తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు..వారి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..ఉత్తర తమిళనాడు నుంచి కర్నాటక మీదుగా కొంకణ్‌ తీరం వరకు ద్రోణి కొనసాగుతోంది.. బంగ్లాదేశ్‌ పరిసర ప్రాంతాల నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది..శనివారం,,అదివారం,,సోమవారం కూడా వర్షాలు కురుస్తాయని  అధికారులు తెలిపారు.. అంతర్గత తమిళనాడు నుంచి మధ్య మధ్యప్రదేశ్ వరకు గల ద్రోణి-గాలి కోత ఇప్పుడు దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి జార్ఖండ్ వరకు అంతర్గత కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా ఉత్తర ఛత్తీస్‌గఢ్ & పొరుగున గల ఉపరితల ఆవర్తనంతో కలసి సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నదని వాతావరణ శాఖ పేర్కొంది.

మూడు రోజులకు వాతావరణ సూచనలు:-(ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం)- ఈరోజు, రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 30-40 కి మీ వేగంతో) వీచే అవకాశం ఉంది.

సోమవారం తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 30-40 కి మీ వేగంతో) వీచే అవకాశం ఉంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *