దేశంలో భారీ విధ్వసం కుట్రను చేధించిన NIA- ISIS కు చెందిన 8 మంది ఉగ్రవాదులు అరెస్ట్
అమరావతి: దేశవ్యాప్తంగా మందుపాతరలు పేల్చి భారీ విధ్వంసం సృష్టించాలన్న ఉగ్రవాదుల కుట్రను NIA భగ్నం చేశారు.. NIA అధికారులు సోమవారం నిషేధిత ISIS ఉగ్రవాద స్థావరాలపై దేశావ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లోని 19 ప్రాంతాల్లో మెరుపు దాడులు చేశారు.. ISIS కు చెందిన 8 మంది ఉగ్రవాదులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.. కర్ణాటకలోని బళ్లారి, బెంగళూరు,,మహారాష్ట్రలోని అమరావతి,, ముంబై,, పుణె,,జార్ఖండ్ లోని జంషెడ్ పూర్,, బొకారోతోపాటు దేశరాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో దాడులు జరిగాయి.. మినాజ్ అలియాస్ మహ్మద్ సులేమాన్ అనే ఉగ్రవాది నేతృత్వంలో దేశంలో పేలుళ్లకు కుట్ర జరిగినట్లు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు..వీరిలో మినాజ్ అలియాస్ మహ్మద్ సులేమాన్,, సయ్యద్ సమీర్ ఇద్దరూ బళ్లారిలో పట్టుబడ్డారు.. అనాస్ ఇక్బాల్ షేక్ ముంబైలో దొరికాడు.. మహ్మద్ మునీరుద్దీన్,, సయీద్ సమీయుల్లా అలియాస్ సమీ,, మహ్మద్ ముజామిల్ బెంగళూరులో అధికారుల అరెస్ట్ చేశారు.. షయాన్ రెహ్మాన్ అలియాస్ హుస్సేన్ ను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు..మహ్మద్ షాబాజ్ అలియాస్ జుల్ఫికర్ అలియాస్ గుడ్డూను జంషెడ్ పూర్ లో అరెస్ట్ చేశారు..దేశంలో పేలుళ్లకు ISIS కుట్ర చేస్తుందన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో అధికారులు 19 ప్రాంతాల్లో దాడులు చేశారు..