కుప్పారాలో ఎన్ కౌంటర్,నాలుగురు ఉగ్రవాదులు హతం
అమరావతి: నార్త్ కాశ్మీర్ లోయ, కుప్వార పరిధిలోని మాచల్ సెక్టర్ పరిధిలోని కాలా అడవుల్లో పోలీసులు,,ఆర్మీ అధికారులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్ లో నాలుగురు ఉగ్రవాదులు ఎన్ కౌంటర్ లో మరణించారు..కుప్వారా పరిధిలోని నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నిస్తున్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు,, పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి..బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడంతో,భద్రత బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి..ఈ కాల్పుల్లో ముష్కరులు మరణించారు..ఉగ్రవాదులు కోసం పోలీసులు,,బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నయని కాశ్మీరీ పోలీసు అధికారలు తెలిపారు.