రానున్న 5 రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు
అమరావతి: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరకిలు జారీ చేసింది.. రానున్న 5 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది..బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది..ప్రధానంగా బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.. భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని,, సోమవారం ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆ తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది..ఆదివారం నుంచి తమిళనాడు,,కేరళ రాష్ట్రల్లో అంతటా వర్షాలు కురుస్తున్నాయి.