వైనాట్ 175కి, అభ్యర్దుల మార్పులు ఎందుకు-జనసేన నేత పృథ్వీరాజ్
అమరావతి: తర్వలో జరగనున్న సార్వత్రిక ఎన్నికను ఎదుర్కొంనేదుకు జనసేన,, టీడీపీల రెండు జెండాలు కలవడం రాజకీయ మార్పుకు శుభసూచికమని సినీనటుడు, జనసేన నేత పృథ్వీరాజ్ అన్నారు..మంగళవారం అయన మీడియాతో మాట్లాడుతూ ‘‘నేను ఎన్నికల్లో పోటీ చెయ్యను అని అన్నారు..పవన్ కళ్యాణ్,, చంద్రబాబులు వదిలిన బాణం నేను,, మార్చిలో ఎన్నికల ప్రచారానికి వస్తానును,, డ్యాన్సులు, సినిమాలు, కలెక్షన్లు, డిస్టిబ్యూటర్ల గురించి మాట్లాడేవాళ్లు మినిస్టర్లా అంటూ మండిపడ్డారు.. ప్రాజెక్టులు అంటే ఏంటో అంబటి రాంబాబుకు తెలుసా,, ఎప్పుడైనా ప్రాజెక్టుల గురించి అంబటి మాట్లాడారా అంటూ నిలదీశారు.. ఎప్పుడూ మూడు పెళ్లిలు,, రెండు చోట్ల ఓటమి గురించే మాట్లాడారు’’ అంటూ పృధ్వీరాజ్ విమర్శించారు..
130 స్థానాలతో టీడీపీ-జనసేన కూటమి మిశ్రమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.. ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీలపై పృథ్వీరాజ్ మాట్లాడుతూ షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాణం,, పీసీసీ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు…కాంగ్రెస్ వదిలిన బాణం వల్ల వైసీపీ ఏం జరుగుతుందో చూడాలంటూ పృథ్వీ వ్యాఖ్యానించారు..వైనాట్ 175 అని చెప్పుకునే మీకు భయం ఎందుకు?? ఈ అభ్యర్దుల మార్పులు ఎందుకు అంటూ పృథ్వీరాజ్ ప్రశ్నించారు..చంద్రబాబు, పవన్ కల్యాణ్ వదిలిన బాణం పృథ్వీరాజ్ మార్చి నెల నుంచి జనంలోకి వస్తాను అని చెప్పారు..పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల వల్ల ఏపీలో ఏ ప్రాజెక్టు ఆగిపోయాయో చెప్పాలని వైసీపీ నేతలను పృథ్వీ ప్రశ్నించారు.. రోజా లాంటి బూతుల మంత్రులు కుప్పకూలిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు..శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకూ నన్ను ప్రచారానికి వాడుకుని వదిలేసిన అధికార పార్టీ సంగతి చూస్తా,,, ఎవరి జాతకం ఏంటనేది నా దగ్గర ఉందంటూ పృథ్వీరాజ్ హెచ్చరించారు.. లోకేశ్ దగ్గర ఎర్ర డైరీ ఉన్నట్లు నా దగ్గర కూడా ఓ పీఆర్ డైరీ ఉందన్నారు.. అందులో అందరి జాతకాలు ఉన్నాయని,,వాటిని సందర్బం వచ్చిన సమయలో ఓపెన్ చేస్తానంటూ తెలిపారు.