నాగాలాండ్ తొలి మహిళ ఎమ్మేల్యేగా చరిత్ర సృష్టించిన హెకానీ జఖాలు
అమరావతి: నాగాలాండ్ రాష్ట్ర హోదా పొందిన 60 ఏళ్ల తరువాత సరికొత్త అధ్యాయం న్యాయవాది, సామాజిక కార్యకర్త అయిన హెకానీ జఖాలు (48) సృష్టించారు..తొలిసారి ఓ మహిళా ఎమ్మెల్యే నాగాలాండ్ అసెంబ్లీలో అడుగిడనున్నారు.. ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం 183 మంది అభ్యర్థుల్లో నలుగురు మహిళలు ఉన్నారు.. NDPP అభ్యర్థిగా బరిలో నిలిచిన ఈమె,,దిమాపుర్ స్థానం నుంచి 1,536 ఓట్ల ఆధిక్యంతో లోక్ జనశక్తి పార్టీకి చెందిన అజితో జిమోమినిపై విజయం సాధించారు..పశ్చిమ అంగామి స్థానంలో NDPPకి చెందిన మరో మహిళా అభ్యర్థి సల్హౌతునొ క్రుసో కూడా అధిక్యంలో ఉన్నారు.. 1963లో నాగాలాండ్కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా లభించింది..అప్పటినుంచి ఈశాన్య రాష్ట్రంలో 13 సార్లు శాసనసభ ఎన్నికలు జరిగాయి..అయితే ఇప్పటివరకు ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టిన దాఖలాలు లేవు.. రాష్ట్రంలో మొత్తం 13.17లక్షల మంది ఓటర్లు ఉండగా, అందులో దాదాపు సగం 6.56లక్షల మంది మహిళా ఓటర్లే ఉన్నారు..ఇప్పటి వరకు అక్కడ జరిగిన మొత్తం అసెంబ్లీ ఎన్నికల్లో 20 మంది మహిళలు మాత్రమే పోటీ చేసి పరాజయం పొందారు..NDPPతో కలిసి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.