హక్కుల గురించి తెలిసిన వారు రాజ్యాంగ బాధ్యతలను సైతం విస్మరించరాదు-హైకోర్టు
అమరావతి: ప్రాథమిక హక్కుల గురించి తెలిసిన వారు రాజ్యాంగ బాధ్యతలను సైతం విస్మరించరాదని,,మోటార్ వాహనాల చట్టం ప్రకారం హైవేలపై రైతులు ట్రాక్టర్ ట్రాలీలను వాడరాదని స్పష్టం చేసింది..కనీస మద్దతు ధరపై చట్టం చేయాలనే పలు డిమాండ్ల పేరుతో ఆందోళన చేస్తున్న రైతులను పంజాబ్ & హర్యానా హైకోర్టు మంగళవారంనాడు మందలించింది.. ప్రజలు పెద్ద సంఖ్యలో ఎక్కడా గుపులు గుంపులుగా చేరకుండా చూడాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది..”వాళ్లకు (రైతులకు) నిరసనలు తెలిపే హక్కు ఉంటుంది..అయితే అదికూడా చట్ట బద్దమైన ఆంక్షలకు లోబడి ఉండాలి” అని కోర్టు స్పష్టం చేసింది..విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తమ వాదన వినిపిస్తూ,, ఆందోళన చేస్తున్న రైతులతో వారి డిమాండ్లపై చర్చలు జరుపుతున్నట్టు తెలిపింది.. దీనిపై కోర్టు స్పందిస్తూ రైతులతో చర్చల్లో పురోగతిపై తాజా అఫిడవిడ్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
బుధవారం నుంచి ‘ఢిల్లీ ఛలో’ ర్యాలీని తిరిగి:- 5 పంటలను ఐదేళ్ల పాటు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను రైతులు సోమవారంనాడు జరిగిన చర్చల్లో తోసిపుచ్చారు.. ప్రభుత్వ ప్రతిపాదన రైతులకు అనుకూలంగా లేవని తేల్చేశారు.. ప్రభుత్వం కొత్తగా చేసిన ప్రతిపాదన ఏదీ లేదని,, అది రైతులకు ప్రయోజనం చేకూరే ప్రతిపాదన కాకపోవడంతో నిర్ద్వంద్వంగా తాము తోసిపుచ్చామని రైతు నేత జగ్జిత్ సింగ్ దలేవాల్ తెలిపారు. బుధవారం నుంచి ‘ఢిల్లీ ఛలో’ ర్యాలీని తిరిగి ప్రారంభిస్తామని పేర్కొన్నారు.