చంద్రబాబకు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
పబ్లిక్ ర్యాలీలు, సభల్లో పాల్గొనవచ్చు..
అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కేసులో సోమవారం విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ అత్యున్నత చంద్రబాబుకు న్యాయస్థానం రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.. గతంలో ఇచ్చిన బెయిల్ ఈ నెల 28 వరకు ఉంది.. ఈ కేసు విషయమై సోమవారం హైకోర్టులో ఇరు వర్గాల వాడీవేడీ వాదనలు వినిపించాయి.. చంద్రబాబుకు బెయిల్ లభించడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.. ముందుగా ఊహిచంనట్లుగానే మధ్యామ్నం 2:15 గంటలకు జస్టీస్ మల్లికార్జున్ రావు ధర్మాసనం ఆర్డర్స్ ఇచ్చింది.. చంద్రబాబు తరపు అడ్వకేట్స్,, కోర్టు ముందు చంద్రబాబుకు గుండె సమస్యలపై వైద్యులు ఇచ్చిన మెడికల్ రిపోట్స్ ను సబ్మిట్ చేశారు..ప్రస్తుతం హెల్త్ గ్రౌండ్స్ పై మధ్యంతర బెయిల్ తో చంద్రబాబు బయట ఉన్నారు..ఈ నెల 29 నుంచి ఆయన పబ్లిక్ ర్యాలీలు, సభల్లో పాల్గొనవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది..