ఇన్ఫోసిస్ సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
అమరావతి: ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, సతీమణి సుధామూర్తి రాజ్యసభకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నామినేట్ చేశారు..శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.. ఈ మేరకు సుధామూర్తికి శుభాకాంక్షలు తెలియచేస్తూ,, సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ కావడం సంతోషకరమైన విషయమన్నారు.. సామాజిక సేవలో సుధామూర్తిది స్ఫూర్తిదాయక ముద్ర అని కొనియాడారు.. సామాజిక సేవ, దాతృత్వం, విద్య సహా విభిన్న రంగాలకు సుధా జీ చేసిన కృషి అపారమైనదని ప్రశంసించారు..సుధామూర్తి లాంటి వ్యక్తి రాజ్యసభలో ఉండటం నారీ శక్తికి ఒక శక్తివంతమైన నిదర్శనం అని కొనియాడారు..రాజ్యసభకు నామినేట్ అయిన సుధామూర్తికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.