AMARAVATHIDEVOTIONAL

శివనామస్మరణతో మార్మోగిన శ్రీకాళహస్తీశ్వరాలయం

శ్రీకాళహస్తీ: శివనామస్మరణతో మార్మోగిన శ్రీకాళహస్తీశ్వరాలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భాగంగా శుక్రవారం మహాశివరాత్రి పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి, అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. సామాన్య భక్తులకు కూడా శీఘ్రంగా దర్శనం అయ్యే విధంగా ఆలయ అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు.

స్వామి అమ్మవార్లు పుర వీధుల్లో: – ప్రముఖ శైవక్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తి పుణ్య క్షేత్రము నందు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లు పుర వీధుల్లో విహరించారు. శ్రీస్వామివారు గంగాదేవి సమేత ఇంద్ర విమానం వాహనంపై విహరించగా తల్లి శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారు చప్పర వాహనంపై విహరించారు. భక్తులు అధికసంఖ్యలో స్వామి అమ్మవార్లను దర్శించుకునీ కర్పూర హారతులు, పూలు, పండ్లు, కొబ్బరికాయలు , సమర్పించి తమ మొక్కుబడులు తీర్చుకునీ స్వామి అమ్మవార్ల కృపా కటాక్షములు పొందారు.. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు ఆలయ చైర్మన్ అంజూర్ తారక శ్రీనివాసులు, ఆలయ కార్యనిర్వాహణ అధికారి నాగేశ్వరావు పర్యవేక్షించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *