బీజెపీలోకి క్యూ కడుతున్న మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు-బీజెపీలో చేరిన అశోక్ చవాన్
అమరావతి: మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది..అ పార్టీ సినియర్ నాయకుడు,మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ మంగళవారం మధ్యహ్నం (BJP) భారతీయ జనతా పార్టీలో చేరారు..అశోక్ చవాన్ను మహారాష్ట్ర బీజేపీ ముఖ్య బాధ్యుడు చంద్రకాంత్,, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పార్టీలోకి ఆహ్వానించారు..
అశోక్ చవాన్:- “భారతీయ జనతా పార్టీలో” చేరాను..నేటి నుంచి నా కొత్త రాజకీయ జీవితం ప్రారంభమైందని వ్యాఖ్యనించారు..కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మీకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫోన్ చేశారా అని మీడియా ప్రతినిధులు చవాన్ను ప్రశ్నించగా,, ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా,,బీజేపీలో చేరడం మాత్రం సంతోషంగా ఉందని’ అశోక్ చవాన్ అన్నారు..
దేవంద్ర ఫడ్నవీస్:- సీనియర్ నేత అశోక్ చవాన్ బీజెపీలో చేరడం సంతోషంగా ఉందని దేవంద్ర ఫడ్నవీస్ చెప్పారు..అశోక్ చవాన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని వెల్లడించారు..అశోక్ చవాన్ బాటలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా ఎమ్మెల్యేలు బీజెపీ తీర్దం పుచ్చుకునేందుకు సిద్దంగా వున్నాట్లు తెలుస్తొంది.
అశోక్ చవాన్కు రాజ్యసభ టికెట్ వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి,,దినిపైన బీజేపీ ప్రకటన చేయనుందని సమాచారం.