AMARAVATHINATIONAL

“యువ హిందూ వివాహిత మహిళలే” టార్గెట్”-సృతిఇరానీ

సందేశ్ ఖలీలో దారుణలు..

అమరావతి: తృణమూల్ కాంగ్రెస్ గూండాలు “యువ హిందూ వివాహిత మహిళలను” టార్గెట్ చేస్తున్నారని కేంద్ర మహిళ,,శిశు శాఖ మంత్రి సృతిఇరానీ అన్నారు..మీడియా సమావేశంలో అమె మాట్లాడుతూ బెంగాల్ లోని 24 పరగాణలకు దగ్గరల్లో వున్న సందేశ్ ఖలీ అనే గ్రామంలో స్థానిక తృణమూల్ నాయకులు క్రమపద్ధతిలో లైంగిక దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించింది..పార్టీ వర్క్ చేయాలంటూ,,రోజు వివహిత మహిళలను వారి భర్తల ముందే పార్టీ కార్యాలయాలకు తీసుకుని వెళ్లెవారని పేర్కొన్నారు..సంవత్సరాలు తరబడి వేధింపులకు గురి అవుతున్న మహిళలు నేడు విధుల్లోకి వచ్చి,,తమ ఆవేదనను మీడియాకు తెలియచేసే దాకా బయట ప్రపంచంకు ఈ విషయం తెలియదన్నారు..బాధిత మహిళలు బెంగాల్ భాషాలో మాట్లాడడంతో,,ఈ సంఘటన యొక్క తీవ్రత దేశ ప్రజలకు అర్ధంకాలేదన్నారు.. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షానావాజ్ ను విచారించేందుకు,,ఈ.ఢీ అధికారులు అతని ఇంటికి వెళ్లినప్పడు,వారిపై రాళ్లతో దాడిచేశారన్నారు..ఈ దాడిలో 3 ఈ.డీ అధికారులకు తీవ్రగాయాలు అయ్యాయన్నారు..మహిళలు తమ గొంతును విన్పించేందుకు రోడ్లపైకి రాకుండా,,మమత బెనర్జీ(మమత బంధోపాధ్యా) అక్కడ 144 సెక్షన్ విధించిందని మండిపడ్డారు..
5వేల ఎకరాలు కబ్జా:- ఈ ప్రాంతాల్లో తృణమూల్ కాంగ్రెస్ నాయకులు స్థానికులకు వున్న భూమిని తొలుత కౌలుకు తీసుకుంటారని,,అటు తరువాత దౌర్జన్యంగా భూమిని సొంతం చేసుకుంటారు..అదేమని అడిగిన వారిపైకి పోలీసులను ఉసిగొల్పుతారని బాధితులు ఆరోపించారు..తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఈ విధంగా తమ వద్ద నుంచి దాదాపు 5 వేల ఎకరాలు కబ్జా చేశారని అవేధన వ్యక్తం చేశారు..ఈలాంటి అకృత్యలకు పాల్పపడుతున్నది ఏవరు అనేది తేలాల్సవున్నది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *