మరో సారి భారతదేశంపై విషం చిమ్మిన మాల్దీవుల అధ్యక్షుడు
అమరావతి: భారతదేశ సహనాని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు మరోసారి పరీక్షించాడు..తొలి నుంచి భారత వ్యతిరేక వైఖరి కనబరుస్తున్న మహమ్మద్ ముయిజ్జు,,మన దేశంపై మరో సారి నోరుపారేసుకున్నారు.. మే 10వ తేదీ తరువాత భారత సైన్యం మాల్దీవుల్లో ఉండరని,, చివరికి సివిల్ దుస్తుల్లో కూడా తమ భూభాగంపై ఉండనిచ్చేది లేదన్నారు..మాల్దీవులు,, చైనాదేశం మధ్య సైనిక సహకారంపై కీలక ఒప్పందం జరిగిన గంటల వ్యవధిలోనే ముయిజ్జు ఈ విషం చిమ్మేడు..భారత సైన్యం మన భూభాగంపై ఎలాంటి దుస్తుల్లోనూ కనిపించదని,,ఈ విషయం నేను ఎంతో విశ్వాసంతో మీకు తెలియచేస్తున్నాను అని వారి దేశ ప్రజలను ఉద్దేశించి అన్నారు.. తన అటోల్ పర్యటనలో భాగంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.. భారత సైన్యాన్ని తిరిగి వెనక్కు పంపించడంలో తమ ప్రభుత్వం విజయం సాధించిందని,, అయితే కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని దుమ్మెత్తి పోశారు.. స్థానిక ప్రజలకు మానవతా సాయం,, వైద్య సేవల కోసం శ్రీలంకతో ఒప్పందం చేసుకున్నారు.. భారతదేశంను కాదనుకుంటున్న మాల్దీవులతో శ్రీలంక ఎలా ముందుకు సాగుతుందొ వేచి చూడాలి.