అమెరికాలో ఉన్మాదుల కాల్పులు,22 మంది మృతి
అమరావతి: అమెరికాలో మళ్లీ ఉన్మాదులు ప్రజలపై కాల్పులతో చేలరేగిపోయారు..మైనే రాష్ట్రంలోని లెవిస్టన్ లో దుండగులు జరిపిన మాస్ షూటింగ్ లో 22 మంది మరణించిగా,, మరో 60 మందికిపైగా గాయపడ్డారు..సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి,,క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు..గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని,,మృతల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం..బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ దాడి జరిగినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.. ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ షెరీఫ్ పోలీస్ కార్యాలయంకు సంబంధించిన ఫేస్ బుక్ అకౌంట్ పేజీలో అనుమానితుడి ఫొటోలను విడుదల చేశారు..ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, అన్ని వ్యాపార సంస్థలను మూసివేయాలని సూచించారు..