మానవ అక్రమ రవాణా కేసులకు సంబంధించి 10 రాష్ట్రాల్లో NIA సోదాలు
అమరావతి: దేశ వ్యాప్తంగా మానవ అక్రమ రవాణా కేసులకు సంబంధించి 10 రాష్ట్రాల్లో NIA అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు..ఇందులో భాగంగా త్రిపుర,,అస్సాం,, పశ్చిమ బెంగాల్,, కర్ణాటక,,తమిళనాడు,, తెలంగాణ,, హర్యానా,, పుదుచ్చేరి,,రాజస్థాన్,,జమ్మూ అండ్ కాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి..సంబంధిత రాష్ట్రాల్లోని స్థానిక పోలీసులను సమన్వయం చేసుకుంటు NIA అధికారులు అనుమానితుల నివాసాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు..అంతర్జాతీయ మాఫీయాలో సంబంధాలు ఏర్పరుచుకుని మానవ అక్రమ రవాణా చేస్తున్న మాఫీయా రాకెట్ ను వెలికి తీసేందుకు 10 రాష్ట్రాల్లో దాదాపు 50 ప్రదేశాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.. కెనడాకు వలస వెళ్లేందుక చట్టపరమైన డాక్యుమెంటేషన్ ను ఏర్పాటు చేస్తామని,,ఉపాధి అవకాశాలతో పాటు ఇతర ప్రయోజనాలు కల్పిస్తామని యువతను నమ్మించి అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం వుండడంతో ఈ తనిఖీలు చేస్తున్నారు.. శ్రీలంకకు చెందినవారిని ఇమ్రాన్ ఖాన్ గ్యాంగ్ బెంగళూరు, మంగళూరులోని పలు ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్న ఇమ్రాన్ ను బెంగళూరు డివిజన్ కు చెందిన NIA అధికారులు అరెస్ట్ చేశారు..ఇతని నుంచి రాబట్టిన సమాచారం మేరకు, NIA అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తొంది.