AMARAVATHIDEVOTIONAL

నేటితో ముగియనున్న ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు- నేత్రపర్వంగా చక్రస్నానం

కడప: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక  బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన శనివారం ఆలయ సమీపంలోని  పుష్క‌రిణిలో చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు.. ఆలయంలో  ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని  మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు శ్రీ లక్ష్మణ సమేత సీతారాములవారు తిరుచ్చిలో, సుదర్శన చక్రత్తాళ్వార్‌ పల్లకిలో ఊరేగింపుగా పుష్క‌రిణి వ‌ద్ద‌కు వేంచేశారు. ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వేడుకగా స్నపనతిరుమంజనం  నిర్వహించారు. ఇందులో సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంతో అభిషేకాలు అందుకున్నారు. అనంత‌రం అర్చకులు వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో శ్రీకోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *