AMARAVATHIDISTRICTS

ఫిర్యాదులు పునరావృతం కాకుండా నాణ్యమైన పరిష్కారాలు అందించండి-కమిషనర్ వికాస్

నెల్లూరు: ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జరుగుతున్న స్పందన కార్యక్రమంలో అందుకున్న విజ్ఞప్తులకు నాణ్యమైన పరిష్కారాలు అందించాలని, ఫిర్యాదులు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ సూచించారు. కార్యాలయంలోని ఎ.పి.జె అబ్దుల్ కలాం సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన స్పందన వేదికలో కమిషనర్ పాల్గొని “డయల్ యువర్ కమిషనర్” కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ ను నేరుగా మాట్లాడారు. వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను కమిషనర్ సంబంధిత విభాగం అధికారులకు తెలియజేసి ఫిర్యాదు సూచించిన గడువులోపు నాణ్యమైన పరిష్కారం అందించాలని ఆదేశించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *