AMARAVATHIDISTRICTS

తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఇంత వరకు ఆదుకొలేదు-అజీజ్

రాష్ట్రంలో అభివృద్ది అటకెక్కింది..

నెల్లూరు: రాష్ట్రం పరిస్థితి అధోగతి పాలైందని,,రైతులకన్నీరు, ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినపడటం లేదని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అన్నారు..సోమవారం నగరంలోని అయన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశం మాట్లాడుతూ జగనన్న వస్తే వర్షాలు వస్తాయని ప్రగల్బాలు పలికారని, రాష్ట్ర పరిస్థితి అతివృష్టి అనావృష్టిల తయారైందన్నారు..వాతావరణ మార్పులు ప్రభుత్వ పాలసీలతో రైతులు ఎంతో నష్టపోతున్నారని, కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్ర రాష్ట్రం రెండో స్థానంలో రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఉందని, భారతదేశానికి 63% జీడీపీ రైతుల ద్వారానే వస్తుందని అన్నారు..రైతు భరోసా కేంద్రాలు రైతు భక్షక కేంద్రాలుగా మారాయని, రైతులకు అందాల్సినవి ఏవి వైసిపి ప్రభుత్వంలో అందటం లేదని, రైతులకు యూరియా కోసం క్యూలో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆరోపించారు..తుఫానులో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోలేదని, బడ్జెట్లో చూపించిన రూ.3 వేల కోట్ల డిసాస్టర్ ఫండ్ ఏమైందని ప్రశ్నించారు..టిడిపి హయాంలో 75 శాతం పూర్తిచేసిన పోలవరాన్ని వైసిపి పూర్తి చేయలేక పోయిందని కనీసం పంటకాలు వల పూడికలు తీసిన పాపాన కూడా పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు..జగన్మోహన్ రెడ్డిని నమ్మి పరిశ్రమలు రాష్ట్రానికి రావటం లేదని, వచ్చిన పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోతున్నాయని అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *