టీడీపీ జాతీయ అధ్యక్షడు చంద్రబాబు అరెస్ట్
అమరావతి: ఎట్టేకేలకు ప్రతిపక్షఃనేత,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సిఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు..శనివారం వేకువ జామును నుంచి నంద్యాలోని ఆరె.కె ఫంక్షన్ హాలు వద్ద హైడ్రామా చోటు చేసుకుంది..సిఐడీ డీస్ఫీ ధనుంజయ్ చంద్రబాబు విడిది చేసిన శిబిరం వద్దకు చేరుకుని 50 సిఆర్ పిసి నోటీసులు అందచేశారు.టీడీపీ అధికారంలో వున్న సమయంలో యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం కేటాయించిన నిధుల నుంచి దాదాపు రూ.300 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని ఏ.పీ సిఐడీ పోలీసులు ఆరోపించారు.ఆ కేసుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు క్రైమ్ నెంబరు 29-2021 క్రింద,,చంద్రబాబును 37వ ముద్దాయిగా చేరుస్తు,సిఐడి యాక్టు ప్రకారం 12,13(2)రెడ్ విత్ 13(1) (సి) (డీ),,అలాగే సి.ఆర్.పి.సి 488,471,409,201,109, 34,37 తదితర సెక్షన్లు క్రింద కేసులు నమోదు చేసిన తెలుస్తొంది.రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులను ఆర్దరాత్రి నుంచే హౌస్ అరెస్ట్ లు చేశారు.శాంతి భద్రతలకు ఎలాంటి సమస్య లేకుండా అరెస్ట్ లు చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.మరో వైపు చంద్రబాబుకు హైకోర్టులో బెయిల్ తీసుకునేందుకు లాయర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.