సర్ఫరాజ్ మెమోన్ అనే ఉగ్రవాది ముంబై చేరుకున్నాడు, అప్రమత్తంగా ఉండాలంటూ ఎన్ఐఏ హెచ్చరిక
అమరావతి: దేశ వాణిజ్య రాజధాని ముంబైలోకి మద్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన ప్రమాదకారి,,అతి కిరాతకుడు అయిన మెమోన్ సర్పరాజ్ అనే వ్యక్తి ప్రవేశించాడని,,అతడి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ముంబై పోలీసులకు NIA (జాతీయ దర్యాప్తు సంస్థ) e-mail ద్వారా హెచ్చరించింది.. NIA అధికారులు ఒక న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన వివరాలు ఇలా వునాయి… సర్పరాజ్ కు సంబంధించిన వివరాల్ని ముంబై పోలీసులతోపాటు, మధ్యప్రదేశ్లోని ఇండోర్ పోలీసులకు కూడా మెయిల్ చేసింది..ఎన్ఐఏ తెలిపిన వివరాల ప్రకారం.. సర్ఫరాజ్, చైనా,, హాంకాంగ్,,పాకిస్తాన్ దేశాల్లో ఉగ్రశిక్షణ పొందాడని,, అతడు దారుణమైన ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడే అవకాశం వుందని పేర్కొంది..అలాగే అతడి ఫొటో, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఇతర వివరాల్ని పోలీసులకు అందజేసింది..ఆప్రమత్తంగా వ్యవహరించి,,వెంటనే అతడిని అదుపులోకి తీసుకోవాలని కోరింది..
ఆయుధ శిక్షణ తీసుకునేందుకు:- ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు శనివారం ఇద్దరు ఉగ్రవాదుల్ని అరెస్టు చేశారు..వీళ్లు భారత్ సరిహద్దు దాటి పాకిస్తాన్ లోకి వెళ్లి అక్కడ ఆయుధ శిక్షణ తీసుకునేందుకు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు..మహారాష్ట్ర థానే వెస్ట్ కు చెందిన ఖాలీద్ ముబరాక్ ఖాన్(21),,తమిళనాడుకు చెందిన అబ్దుల్ (26)ను అరెస్ట్ చేసి,,వీరి దగ్గరి నుంచి భారీ స్థాయిలో ఆయుధ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..వీరికి పాకిస్తాన్ కు చెందిన హ్యండిలర్ నుంచి అదేశాలు వస్తుంటాయని తెలిపారు..వీళ్లు సమాచారం ఆధారంగా సర్ఫరాజ్ మెమోన్ విషయం బయటపడిందని,, ఈ అంశంపై ముంబై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.