ఒక దేశం ఒకే ఎన్నికలకు సంబంధించి కమిటీని ప్రకటించిన కేంద్ర న్యాయశాఖ
అమరావతి: ఒక దేశం ఒకే ఎన్నిక’ కమిటీపై కేంద్ర న్యాయశాఖ 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తు శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది..కమిటీ చైర్మన్ గా మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను నియమించింది.. కమిటీ సభ్యులుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా,, లోక్ సభలో కాంగ్రెస్ విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి,, గులాం నబీ ఆజాద్,, 15వ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్ కే సింగ్,, లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ డాక్టర్ సుభాష్ ఎస్.కస్యప్,, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే,,మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి నియమితులయ్యారు..ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్,,కమిటీ సెక్రటరీగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితీష్ చంద్రకు బాధ్యతలు అప్పగించింది..త్వరలో 5 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు,,2024 లోక్ సభ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఈ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది.
Centre forms eight-member committee to examine ‘one nation, one election’; high-level panel headed by former President Kovind
Read @ANI Story | https://t.co/ft7xyF5DTm#OneNationOneElection #RamNathKovind pic.twitter.com/Sph2UsQC0X
— ANI Digital (@ani_digital) September 2, 2023