అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
అమరావతి: వైఎస్ వివేక హత్య కేసులో అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది..అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది..దీంతో అవినాశ్ రెడ్డి అరెస్ట్ కు సీబీఐకి లైన్ క్లియర్ అయింది..అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టు అసాధారణమైన ఉత్తర్వులు జారీ చేసిందని సుప్రీంకోర్టు పేర్కొంది..హైకోర్టు ఉత్తర్వులు దర్యాప్తునకు నష్టం కలిగిస్తాయని వ్యాఖ్యనించింది..సీబీఐ దర్యాప్తు గడువును సుప్రీంకోర్టు రెండు నెలలు పొడిగించింది..గతంలో సుప్రీంకోర్టు ఏప్రిల్ 30 వరకు సీబీఐ విచారణ గడువు ఇచ్చింది..
నిందితులను దర్యాప్తు చేసే సమయంలో సదరు వ్యక్తికి రాతపూర్వక, ప్రింట్ రూపంలో ప్రశ్నలు ఉండాలని చెప్పడానికి ఎటువంటి అధికారం లేదని స్పష్టం చేసింది..హైకోర్టు ఉత్తర్వులు దర్యాప్తుకు తీవ్ర నష్టం కలిగిస్తాయని చెప్పారు. సునీత పిటిషన్ పై సీజేఐ ధర్మాసనం సుదీర్ఘమైన తీర్పును ఇచ్చింది..హైకోర్టు ఆదేశాలు తప్పుడు సంప్రదాయానికి దారితీసేలా ఉన్నాయని సీజేఐ ధర్మాసనం అభిప్రాయపడింది..