AMARAVATHIINTERNATIONAL

ఇజ్రాయెల్ కు చేరుకున్నఅమెరికా అధ్యక్షుడు జో బైడెన్

అమరావతి: హమాస్ ఉగ్రవాదులతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ కు దన్నుగా నిలిచేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం ఇజ్రాయెల్ లో పర్యటిస్తున్నారు..ఎయిర్ ఫోర్స్ వన్ లో టెల్ అవీవ్ లోని బెన్ గురియన్ విమానాశ్రయంకు చేరుకున్న బైడెన్ కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు స్వాగతం పలికారు..హమాస్ తీవ్రవాద దాడిని ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ కు తన బలమైన మద్దతును ప్రదర్శించడమే ఆ దేశంలో బైడెన్ పర్యటన ప్రధాన ఉద్దేశమని వైట్ హౌస్ ప్రకటించింది..యుద్ధం అనంతరం చేపట్టాల్సిన చర్యలపైనా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చర్చించనున్నట్లు వెల్లడించింది..
రద్దు అయిన జోర్డాన్ పర్యటన:- ఇజ్రాయెల్ పర్యటన తరువాత బైడెన్, జోర్డాన్ వెళ్లాల్సి ఉంది..జోర్డాన్ లో అరబ్ నేతలతో సమావేశం నిర్వహించేలా ముందుగా ప్రణాళిక సిద్దం చేసుకున్నారు.. జోర్డాన్ రాజు అబ్దుల్లా 2,, ఈజిప్టు ప్రధాని ఎల్-సిసీ,,పాలస్తీనా అధ్యక్షుడు మహ్ముద్ అబ్బాస్ తదితరులతో సమావేశం కావాల్సి ఉంది.. అయితే మంగళవారం గాజా ఆసుపత్రిపై దాడి ఘటనతో అనూహ్యంగా బైడెన్, జోర్డాన్ పర్యటన రద్దైంది..బైడెన్ జోర్డాన్ పర్యటన రద్దైనట్లు జోర్డాన్ విదేశాంగ మంత్రి ఐమన్ సఫాది తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *