ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంచిన కేంద్ర ప్రభ్వుతం
రైతులకు శుభవార్త..
అమరావతి: రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు.. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 2024-25 సీజన్ కు సంబంధించి 6 రబీ పంటలకు కనీస మద్దతు ధర (MSP)ను పెంచుతూ నిర్ణయం తీసుకుకుంది..కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర క్రింద గోధుమలు,, బార్లీ,,శెనగ,,కందులు,,ఆవాలు,, సన్ ఫ్లవర్ పంటలు ఉన్నాయి..వీటిలో అత్యధికంగా కందులుపై క్వింటాలు ధరను రూ.425కు పెంచింది..గోధుమల కనీస మద్దతు ధరను రూ.150కి పెంచడంతో క్వింటాల్ గోధుముల ధర రూ.2,275కి చేరింది..బార్లీ రూ.115కి పెంచడంతో క్వింటా ధర రూ.1,850కి,,శెనగ రూ.105కి పెంచడంతో క్వింటా ధర రూ.5,440కి పెరిగింది..కందులు రూ.425 పెరగడంతో క్వింటా ధర 6,425కు,,ఆవాలు రూ.200 పెంచడంతో క్వింటాల్ ధర రూ.5,650కి,,సన్ ఫ్లవర్ రూ.150 పెంచడంతో క్వింటాల్ ధర రూ.5,800కి చేరింది..మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియా సమావేశంలో వెల్లడించారు.