రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం
అమరావతి: ఎక్స్ ప్రెస్ హైవేపై కారు ఎంటర్ కాగానే డ్రైవింగ్ సీట్లో కుర్చున్న వ్యక్తి మితిమిరిన వేగంతో డ్రైవింగ్ చేస్తే,,ఫలితం నిండు ప్రాణాలు అన్న విషయం గుర్తుంచుకోవాల్సి అవసరం వుంది..ఇందుకు అనేందుకు మంగళవారం నెల్లూరుజిల్లా కావలి వద్ద జరిగి ఘెర రోడ్డు ప్రమాదం కాగా నేడు గుజరాత్ లో జరిగిన మరో రోడ్డు ప్రమాంత..ఈ రెండు ప్రమాదల్లో కారును మితిమిరిన వేగంతో డ్రైవ్ చేయడం వల్లే జరిగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాలకు వచ్చారు..ఈ రెండు ప్రమాదల్లో మరణించిన వారి సంఖ్య 13 మంది..కావలి వద్ద జరిగిన ప్రమాదం 5 మరణించగా,గుజరాత్ లో జరిగిన ప్రమాదంలో 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు..అహ్మదాబాద్-వడోదర ఎక్స్ ప్రెస్ హైవేపై బుధవారం చోటుచేసుకుంది..వివరాల్లోకి వెళ్లితే…
ఎక్స్ ప్రెస్ హైవేపై వడోదర నుంచి అహ్మదాబాద్ వైపు అత్యంత వేగంగా వెళ్తున్న Maruti Suzuki Ertiga కారు,, పూనా నుంచి జమ్ముకు వెళ్లుతున్న ఆయిల్ ట్యాంకర్ రిపేరు రావడంతో,రోడ్డు ప్రక్కన అగిపోయింది..ఈ సమయంలో అగి వున్న ఆయిల్ ట్యాంకర్ ను వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టింది..దీంతో కారులో ఉన్న 10 మందిలో 8 మంది మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు ఖేడా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేష్ గధియా మీడియాకు తెలిపారు..గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు..ప్రమాద సమయంలో కారు అతివేగంతో వచ్చినట్లు స్థానికులు చెప్పారని అయన వెల్లడించారు..ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.