అయోధ్య రామ మందిరంలో అధ్భుతమై ఘట్టం అవిష్కృతంమైంది
అమరావతి: శ్రీరామ నవమి రోజు అయోధ్య రామ మందిరంలో అధ్భుతమై ఘట్టం అవిష్కృతంమైంది.. గర్భగుడిలోని బాలరాముడి నుదుటన సూర్య కిరణాలు తిలకంగా ప్రసరించాయి..బుధవారం మధ్యాహ్నం 12-16 నిమిషాల సమయంలో 58 మిల్లీమీటర్ల పరిమాణంతో సూర్య కిరణాలు బాలరాముడి నుదుటిని తాకాయి.. కొన్ని నిమిషాల పాటు ఈ సూర్య తిలకం కనువిందు చేసింది..ఆ సమయంలో ఆలయ అధికారులు బాల రాముడికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు..ఈ అద్భుత దృశ్యాన్ని భక్తులు కనులారా వీక్షించి తన్మయత్వం పొందారు.. ఏటా శ్రీరామనవమి రోజున రాముడి విగ్రహం నుదుటన సూర్య కిరణాలు ప్రసరించేలా అధికారులు ఆలయ నిర్మాణంలో ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు.. ఆలయం మూడో అంస్తు నుంచి గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్య కిరణాలు పడేలా ఏర్పాట్లు చేశారు.. ఇందు కోసం పరిమిత సంఖ్యలో పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు.. ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఓ పరికరాన్ని ఏర్పాటు చేశారు.. అక్కడి నుంచి పైపులోపలికి కాంతి ప్రసరించి తిలకంగా కనిపిస్తుంది..