AMARAVATHINATIONAL

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి చుక్కెదురు

అమరావతి: కాంగ్రెస్ నేత,యువరాజు రాహుల్ గాంధీకి గుజరాత్‌లోని సూరత్ కోర్టులో చుక్కెదురు అయ్యింది..పరువు నష్టం కేసులో తనకు రెండేళ్లు జైలుశిక్ష విధించడం సరికాదంటూ రాహుల్‌ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను సూరత్‌ సెషన్స్‌ కోర్టు తిరస్కరించింది.. ఏప్రిల్ 13, 2019 లోకసభ ఎన్నికల ప్రచారం సందర్బంలో కర్ణాటకలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు,,రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన విషయం విదితమే..దీంతో ఆయన పార్లమెంట్ సభ్యత్వం కూడా రద్దు అయింది..ట్రయల్‌ కోర్టు ఈ కేసుపై పారదర్శకంగా విచారణ చేపట్టకుండా కఠినంగా వ్యవహరించిందని రాహుల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు..ఈ వ్యాఖ్యలపై రెండేళ్లు జైలుశిక్ష విధించాల్సినంత పెద్ద కేసు కాదని,,శిక్షను నిలిపివేయాలని లేకపోతే తన పరువు,, ప్రతిష్ఠకు నష్టం కలుగుతుందని సెషన్స్‌ కోర్టును రాహుల్‌ ఆశ్రయించారు.. రాహుల్‌ పిటిషన్‌పై గత గురువారం వాదనలు విన్న న్యాయమూర్తి R.P మొగేరా నేడు(గురువారం-20-4-23) తీర్పును వెలువరించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *