దిశను మార్చుకున్న మోచా తుపాన్
అమరావతి: మోచా తుపాన్ భారత్ వైపు నుంచి దిశను మార్చుకున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.. మయన్మార్, బంగ్లాదేశ్ వైపు మోచా తుపాను కదులుతున్నట్లు ఐఎండీ ప్రకటించింది..గంటకు 148 కిలో మీటర్ల వేగంతో తీవ్రమైన తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది..మే 14వ తేదిన బంగ్లాదేశ్-మయన్మార్ తీరాల్లో మోచా తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది..
ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకుని మంగళవారం తెల్లవారుజామున అల్పపీడనం ఏర్పడింది.. మంగళవారం సాయంత్రానికి బలపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది..ఆటు తరువాత మోచా తుపానుగా మారనుందని పేర్కొంది..దిని ప్రభావం ఒడిస్సా,,బెంగాల్ పై వుండే ఆవకాశం వుందన్నారు..మోచా తుపాను ప్రభావంతో మే 9వ తేదీ నుంచి 11 తేదీ వరకు అండమాన్, నికోబార్ దీవుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది..మంగళవారం సాయంత్రం నుంచి 50 కిలో మీటర్ల నుంచి 70 కిలో మీటర్ల వేగంతో,, బుధ,గురువారల్లో 55 నుంచి 75 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది..శుక్ర,శని వారల్లో గాలుల వేగం 100 నుంచి 110 కిలో మీటర్లు ఉండొచ్చని అంచాన వేసింది.