విజయవాడ “మేమంతా సిద్ధం” బస్సుయాత్రలో సీఎం జగన్ పై రాయితో దాడి
నెల్లూరు: విజయవాడ “మేమంతా సిద్ధం” బస్సుయాత్రలో బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేశారు.శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది..సీఎం జగన్ పై గుర్తు తెలియ వ్యక్తి క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు..రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమకంటి కనుబొమ్మపై గాయం అయింది..సీఎం జగన్ పక్కనే ఉన్న MLA వెల్లంపల్లికి కూడా ఎడమ కంటికి సైతం గాయం అయింది..వెంటనే సీఎం జగన్ కు బస్సులో వైద్యులు ప్రథమ చికిత్స అందించారు..ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ సీఎం జగన్ బస్సుయాత్ర కొనసాగిస్తున్నారు..
(పార్టీ నేతలు,రాజకీయ నాయకులపై వున్న కోపంతో,,భౌతిక దాడులకు దిగడం దుర్మర్గం..నాయకులపైన కోపం వుంటే అందుకు ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేందుకు వివిధ పద్దతులు వున్నాయి..అంతే కాని రాళ్లతో,,బ్లేడ్ లతో భౌతికంగా గాయపర్చడం వాంఛనీయం కాదు..ఇలా దాడులు జరుగుతుంటే,,నాయకుల అభిమానుల్లో ఆగ్రహాం వ్యక్తం కావడం,ఇది సమాజంలో మంచి పరిణామం కాదు.ప్రతి ఒక్కరు ఇలా ఘటనలను ఖండించాల్సిందే.)