AMARAVATHIPOLITICS

అయోధ్య భవ్య రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఆహ్వానాలను తిరస్కరించిన కాంగ్రెస్

అమరావతి: అయోధ్య భవ్య రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి తమ పార్టీ నేతలు హాజరుకావడం లేదని కాంగ్రెస్ పార్టీ బుధవారం ప్రకటించింది.. జనవరి 22వ తేదీన ఆలయ ప్రారంభోత్సవానికి హాజరుకావాలని సోనియాగాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరికి ఆహ్వానాలు అందాయి.. అయితే అయోధ్య పేరుతో బీజెపీ రాజకీయాలు చేస్తొందని,,అందుకే ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని లేఖలో స్పష్టం చేసింది.. రామ మందిర ప్రాణప్రతిష్టకు సంబంధించిన ఆహ్వానాన్ని ఈ నేతలు తిరస్కరించారు..జనవరి 22న జరగనున్న రామమందిరప్రాణ వేడుకలకు హాజరు కావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ , యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో సహా 6 వేల మందికి పైగా ఆలయ ట్రస్ట్ నిర్వహకులు ఆహ్వానాలు పంపారు.. అయితే, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరితో పాటు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదు..అలాగే సీపీఐ (ఎం) నేత సీతారాం ఏచూరి కూడా ఆహ్వానాన్ని తిరస్కరించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *