AMARAVATHICRIME

బ్రాడెండ్ వాచ్‌ల స్మగ్లింగ్ కేసులో మంత్రి పొంగూలేటి కుమారుడికి నోటీసులు పంపిన కస్టమ్స్

అమరావతి: విదేశాల నుంచి బ్రాడెండ్ వాచ్‌ల స్మగ్లింగ్ కేసులో తెలంగాణకు చెందిన పొంగూలేటి.సుధాకర్ రెడ్డి కొడుకు పేరు తెరపైకి వచ్చింది..సింగపూర్‌ నుంచి బ్రాండెడ్ వాచ్‌ల స్మగ్లింగ్ కేసులో పొంగులేటి హర్ష రెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు నోటీస్ ఇచ్చినట్టు సమాచారం.. ఏప్రిల్ 4వన విచారణకు రావాలని హర్షరెడ్డికి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తొంది..అయితే డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నానని,, ఏప్రిల్ 27 తర్వాత విచారణకు హాజరవుతాని హర్షరెడ్డి సమాధానం ఇచ్చినట్టు తెలియవచ్చింది..ముబిన్ అనే స్మగ్లర్ సింగపూర్ నుండి బ్రాండెడ్‌ వాచ్‌లు తీసుకొచ్చినట్టు కస్టమ్స్ అధికారులు కేసులో పేర్కొన్నారు.. ఒక్కో వాచ్ విలువ 1.75 కోట్ల రూపాయలు ఉంటుంది.. హవాలా రూపంలో వాచ్ కు హర్ష రెడ్డి డబ్బులు చెల్లించినట్లు ఆరోపణలు వస్తున్నాయి..ముబిన్,, హర్ష రెడ్డి డీల్ విషయంలో మధ్యవర్తిత్వం వహించాడు..నవీన్ కుమార్ అనే వ్యక్తిని సైతం కస్టమ్స్ అధికారులు విచారించారు..స్మగ్లింగ్ వాచ్ ల కుంభకోణం 100 కోట్ల రూపాయలకు పైబడి ఉంటుందని కస్టమ్స్ అంచనా వేస్తోంది. ఈ సంఘటనపై కస్టమ్స్ అధికారులు ఫిబ్రవరి 5న కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *