జమిలి ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కాదు-లా కమిషన్ !
అమరావతి: జమిలి ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కాదని లా కమిషన్ తేల్చి చెప్పింది..రాజ్యాంగంలోని ప్రస్తుత చట్టాలను సవరించకుండా,,జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని న్యాయ కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ రితు రాజ్ అవస్తి తెలిపారు..జమిలీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సాధ్యాసాధ్యాల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందన్నారు..2024లో జమిలి ఎన్నికలు ఉండవని,,ప్రతీసారిలాగే ఈసారి కూడా ఎన్నికలు జరుగనున్నాయని పేర్కొంది..రాజ్యంగ సవరణ చేసినట్లయితే,2029లో జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యం అవుతుంది..జమిలీ ఎన్నికలు కూడా రెండు అంచెల్లో పూర్తి చేయాల్సి వుంటుంది.. లోకసభ,శాసనసభ ఎన్నికలు,,స్థానిక సంస్థల ఎన్నికలు జరపాల్సి వుంటుందన్నఅభిప్రాయం లా కమిషన్ వ్యక్తం చేసినట్లు సమాచారం.