రూ.3.50 కోట్లతో పట్టుబడిన AMR గ్రూప్ సంస్థల చైర్మన్ మహేశ్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోట్ల రూపాయలను వివిధ మార్గల్లో తరలించేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తునే వున్నాయి..నల్లధనం తరలింపులను అడ్డుకునేందుకు ఎన్నికల అధికారులు,, పోలీసులు ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు..ఈ క్రమంలో శనివారం ఉదయం బంజారాహిల్స్ లో తనిఖీలు చేస్తున్న పోలీసు అధికారులకు AMR గ్రూప్ సంస్థల చైర్మన్ మహేశ్ రెడ్డి కారులో రూ.3.50 కోట్లు పట్టుబడ్డాయి..ఈ డబ్బుకు సంబంధించి ఎటువంటి రశీదు లేకపోవడంతో పోలీసులు,ఎన్నికల రిటర్నింగ్ అధికారికి స్వాధీనం చేశారు.. మహేశ్ రెడ్డి,, పక్క రాష్ట్రాల నుంచి డబ్బులు తీసుకొచ్చి రాజకీయ పార్టీలకు అందజేస్తున్నట్లు తేలింది..దింతో ఆయనకు సంబంధించిన AMR గ్రూప్ సంస్థల్లో కూడా తనిఖీలు చేపట్టారు.. మహేష్ రెడ్డి ఏ పార్టీ కోసం డబ్బులు తెస్తున్నారనే దానిపై ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు దర్యప్తు ప్రారంభించారు.