ఛత్తీస్గఢ్లో భారీ ఎన్ కౌంటర్ 29 మంది మావోయిస్టులు మృతి
అమరావతి: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మంగళవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది.. కాంకేర్ జిల్లా కల్పర్ అడవిలో జరిగిన ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందగా ఇందులో ఒక మావోయిస్టు అగ్రనేత వున్నట్లు బస్తర్ ఐజీ సుందర్రాజ్ మీడియాకు తెలిపారు..ఎదురు కాల్పుల్లో BSF ఇన్స్పెక్టర్,,ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాల అయినట్లు తెలుస్తొంది.. చోటి బిటీయా పోలీసు స్టేషన్ పరిధిలోని కల్పర్ అడవిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం..ఇంకా పూర్తి స్థాయి వివరాలు అందలేదని కంకేర్ SP IK ఏలేసెలా తెలిపారు.. ఘటనాస్థలి నుంచి AK47 తుపాకులు, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయన్నారు.